‘గౌరవం’ నిలపాలని…..

Gouravam‘గౌరవం’ తొలిరోజు వసూళ్లు చుసి… గీతా ఆర్ట్స్ గుండె గుబులు మంది. శిరీష్ ఎంట్రీ అంటే జనం ఎగబడి వచ్చేస్తారు, చిరు ఫాన్స్ సపోర్ట్ కూడా మనదే.. అనుకున్నారు. 40 % వసూళ్ళు కుడా లేకపోవడం తో శిరీష్ బృందం తీవ్ర నిరాశకు గురయ్యింది. మరో వైపు ’గుండె జారి గల్లంతయ్యింది’ థియేటర్ లు కళకళ లాడి పోతున్నాయి. విడుదలైన ప్రతీచోటా హౌస్ ఫుల్ కలెక్షన్లే. పవన్ ఫాన్స్ ని కూడా నితిన్ తనవైపుకు తిప్పుకోగాలిగాడు. ఆ సినిమా తాకిడి నుంచి తట్టుకుని గౌరవం సినిమాని నిలబెట్టాలని మెగా కుటీరం అప్పుడే ప్రయత్నాలు ప్రారంభిచేసింది. భారీ యెత్తున విజయోత్యవ సభ ఏర్పాటు చేసి… చిరు ఫ్యామిలీ అందరినీ ఒకే వేదిక పైకి తెచ్చి… శిరీష్ మనవాడే అనే సంగతి మరోసారి గట్టిగా చెప్పాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగైనా ఈ సినిమాకి కొన్ని వసూళ్లు దక్కుతాయని ఆశ. అల్లు గౌరవం నిలపాలంటే ఇలాంటి ట్రిక్కులు తప్పవు మరి.