మరో మెగా వారసుడు వరుణ్తేజ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ ఎంట్రీకి ఫ్లాట్ఫామ్ ఎప్పుడో సిద్ధమైనా.. ఇప్పటి వరకూ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. కథానాయిక దొరక్క కొంతకాలం ఈ సినిమా ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఈ గొల్లభామకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. ఈ చిత్రాన్ని ఈనెల 27న ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. హైదరాబాద్ లోనే ఈ చిత్రానికి కొబ్బరికాయ్ కొట్టనున్నారు. ఆ తరవాత గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతారు. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో ఆకట్టుకొన్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.