ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు గిబ్రాన్ సంగీతం అందించనున్నాడని తాజా సమాచారం. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో పూరీ ఎప్పుడూ ముందే వుంటారనే విషయం టాలీవుడ్ లో అందరికి తెల్సిందే. తెలుగులోకి ‘రన్ రాజా రన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగీత దర్శకుడు గిబ్రాన్… ఇటీవలే గోపిచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమాకు సంగీతం అందించాడు. అలాగే తమిళంలో కమల్ హాసన్ నటిస్తున్న వరుస సినిమాలకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. గిబ్రాన్ మ్యూజిక్ కు ఫ్లాట్ అయిన పూరీ.. మహేష్ చిత్రానికి సంగీత దర్శకుడిగా గిబ్రాన్ కు ఛాన్స్ ఇచ్చినట్లుగా వార్త.
ప్రస్తుతం పూరి చిరు 150 వ చిత్ర స్క్రిప్ట్ పనులు బుస్య్గా ఉన్నాడు. అలాగే మహేష్ బాబు కొరటాల మూవీ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు.