మరో రచ్చ…బిగ్ బాస్ మీద మరో కంప్లైంట్ !

బిగ్ బాస్ తొలి రెండు సీజ‌న్స్ ఎటువంటి వివాదాలు (బయట నుండి) లేకుండా సాగిపోయాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఎటువంటి కాంట్రవ‌ర్సీ కూడా లేకుండా అయిపోయాయి. కానీ మూడో సీజ‌న్ మాత్రం ఇంకా మొదలు కూడా కాకుండానే ఎన్నో వివాదాల‌కు దారి తీసింది. అంతకు ముందు నుండీ ఉన్నా బ‌య‌టికి రాలేదా ? లేక ఇప్పుడు మాత్రమే బ‌య‌టికి వ‌స్తున్నాయో తెలియ‌డం లేదు కానీ మూడో సీజ‌న్ మాత్రం కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్రస్ అయ్యింది.

ఇప్పటికే ఎలా సుఖ పెడతారు అని అడిగారని యాంకర్ శ్వేత రెడ్డి సంచలనం రేపగా ఇప్పుడు ఫిదా భామ గాయ‌త్రి గుప్తా కూడా మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీసింది. త‌న‌ను బిగ్ బాస్ లోకి తీసుకుని. అగ్రిమెంట్ కూడా చేసుకున్న త‌ర్వాత ఇప్పుడు కుద‌ర‌దు పొమ్మ‌న్నార‌ని రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. త‌న‌తో బిగ్ బాస్ కో ఆర్డినేట‌ర్స్ ముగ్గురు మాట్లాడ‌ర‌ని ఆ త‌ర్వాత అగ్రిమెంట్ చేసుకున్నార‌ని.. కానీ కొన్ని రోజుల త‌ర్వాత మీరు బిగ్ బాస్ లో లేరు అంటూ చెప్పుకొచ్చార‌ని చెప్పింది గాయ‌త్రి.

మీరు బిగ్ బాస్ ను ఎలా సంతృప్తి ప‌రుస్తార‌ని అస‌భ్యంగా మాట్లాడార‌ని ఆరోపిస్తోంది గాయ‌త్రి. అంతే కాక తనకు ఈ షో అవకాశం రావడం వలన తను ఏడెనిమిది సినిమా అవకాశాలు వదులుకున్నానని ఇప్పుడు ఆ నష్టం ఎవరు భరిస్తారు ? అని అడుగుతోంది ఆమె. ఆమె కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు తమను అడిగిన ప్రశ్నలు చాలా దారుణంగా ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేసింది.