Site icon TeluguMirchi.com

మహాత్మ గాంధీ తో కబాలి..

rajani-ghandiటైటిల్ చూసి అదేంటి అనుకుంటున్నారా..అవును తమిళనాట రజని అభిమానులు రజనీకాంత్ ను ఏకంగా గాంధీ పక్కన కూర్చుపెట్టారు. అసలు స్టోరీ లోకి వెళ్తే..

క్విట్ ఇండియా ఉద్యమం జరిగి ఆగస్టు 9 కి 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. అలాగే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు కానుండడం తో ఈ రెంటినీ పురస్కరించుకుని తమిళనాట ప్రజలు తమ అభిమాన హీరోను స్వాతంత్రోద్యమ కాలం నాటితో పోల్చారు. రజనీకాంత్, మహాత్మాగాంధీలు కలిసి ఉన్నట్లుగా ఓ ఫోటో ను మార్ఫింగ్ చేసి నెట్ లో వదిలారు. అంతే కాదు ఈ ఫోటో కు వరస విజయాలలో ప్రజలను మెప్పిస్తున్న రజనీకాంత్ ను అభినందించిన మహాత్మాగాంధీ అని ఓ ట్యాగ్ కూడా తగిలించేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version