ఫ్రీ గా సినిమా టికెట్స్ ఇస్తున్న హీరో..

గత రెండు నెలలుగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి వారం కనీసం మూడు , నాల్గు సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ చెప్పుకోడానికే మాత్రమే..చూసేందుకు మాత్రం ఏ ఒక్క సినిమా లేదు. మొదటి ఆట తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా భారీ ఎత్తున సినిమాలు విడుదల అవుతుండగా..వాటిలో మాత్రం ‘మల్లేశం, ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ’ సినిమాల ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని “మళ్లీ రావా ” లాంటి హిట్ చిత్రాన్ని అందించిన రాహుల్ నక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ చిత్రం లో శృతి శర్మ కథానాయికగా నటిస్తుంది .ఈ చిత్రానికి స్వరూప్ దర్శకుడు.

ఇక మల్లేశం విషయానికి వస్తే అసూయాత్రం కనిపెట్టిన మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఈ చిత్రం తో హీరో గా పరిచయం కాబోతున్నాడు. ఈ రెండు సినిమాల ఫై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ చిత్రాల టికెట్స్ ను హీరో సందీప్ కిషన్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఈ రెండు సినిమాలు విజయ్మస్ అందించాలని తనవంతుగా సందీప్ కృషి చేస్తున్నారు. మొదటిరోజుకు ఒక్కో సినిమా టికెట్లు 50 చొప్పున కొన్న ఆయన వాటిని హైదరాబాద్లోని ప్రేక్షకులకు ఉచితంగా ఇస్తున్నారు. దీనిద్వారా సినిమాను ప్రోత్సహించినట్లవుతుందని ఆయన భావిస్తున్నారు.