‘ప్రస్థానం’ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు సందీప్ కిషన్. రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి సినిమాలతో హీరోగానూ మారాడు. అంతకు ముందు బాలీవుడ్ లో ఓ సినిమా చేశాడు. ఇప్పుడు తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చాడు. సందీప్ నటించిన తమిళ చిత్రం ‘యరుడా మహేష్’. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. తొలిరేజే హిట్ టాక్ సంపాదించుకొంది. దాంతో సందీప్ సంతోషంతో పులకించిపోతున్నాడు. ”తమిళ ప్రేక్షకుల ఆదరణ… ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. అక్కడ ఇది నా తొలి సినిమా. అయినా సరే.. థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ఈ విజయం ఊహించలేదు. అయితే నాకు తెలుగు సినిమాలే ముఖ్యం. ఎక్కడ ఎన్ని సినిమాలు చేసినా.. తెలుగు సినిమానే ప్రేమిస్తా” అంటున్నాడు. ఈ సినిమా తెలుగులో ‘మహేష్’ పేరుతో విడుదల కానుంది.