దాసరి నారాయణరావు మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. విష్ణు కథానాయకుడు. కేథరిన్ నాయిక. ఈ చిత్రానికి ఎర్ర బస్ అనే టైటిల్ ఖరారు చేశారు. శనివారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తమిళ చిత్రం మంజపాయ్కి రీమేక్ ఇది. ఈనెలాఖరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. చక్రి స్వరాలు అందిస్తున్నాడు. పరవవీరచక్ర తరవాత దాసరి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో దాసరి మనవరాలు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.