పవన్’అత్తారింటికి దారేది’ విడుదలకు ముందే పైరసీ బయటకు వచ్చేసింది. ఇంటర్నెట్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఆదివారం సాయింత్రం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ సినిమా ఫస్టాఫ్ ని ఇంటర్నెట్లో పెట్టేశారు. దీంతో యూనిట్, చిత్రసీమ ఒక్క సారిగా షాక్కు గురైంది. దీంతో వేరే దారిలేక అత్యవసర పరిస్థితి ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ 26న రాకుంటే 27 రావడం ఖాయం అని, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని టీం చెబుతోంది.