‘డబుల్ ఇస్మార్ట్’.. మొదలెట్టేసాడుగా !


హీరో రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ఇదే కాంబినేషన్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ రాబోతుందని.. మార్చి 8, 2024న రిలీజ్ అవుతుందని ఇంతకుముందే ప్రకటించారు. అయితే తాజాగా ఈరోజు ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దీనికి సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ ను చిత్రయూనిట్ ట్విట్టర్ లో షేర్ చేసింది.

రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..

స్టంట్ డైరెక్టర్ కెచ్చా కొరియోగ్రఫీలో భారీ సెట్‌లో రామ్ మరియు ఫైటర్స్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ వర్కింగ్ స్టిల్‌లో రామ్ చేతిలో బాణసంచా పట్టుకుని, ట్రక్కులో కూర్చొని కనిపించాడు. పూరి, కెచ్చా, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్‌పై పూరీ జగన్నాధ్, ఛార్మి కలిసి సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.