చివరి షెడ్యూల్ లో ‘దొరకడు’

dorakaduచంద్రకళ సమర్పణలో ‘చంద్రకళ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం’పై ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం ‘దొరకడు’. హీరో శివాజీ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని వరప్రసాద్ దర్శకత్వంలో మాస్టర్ ఆర్.యు. శ్రీరామ్ అజయ్ నిర్మిస్తున్నారు. మునిరెడ్డి సహనిర్మాత. శివాజీ సరసన గాయత్రి హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ చివరి షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వరప్రసాద్ మాట్లాడుతూ… “సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ కావడంతో మా చిత్రానికి ‘దొరకడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ఫిబ్రవరిలో ఆడియో విడుదల చేసి సినిమాను మార్చిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. సుమన్, అజయ్, కొండవలస, బాబూమోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్ మార్షల్ రమణ, ఎడిటింగ్ : మేనగ శ్రీను, కెమెరా : ఇ.హెచ్.ఎస్.ప్రసాద్, సంగీతం : సునీల్ ధర్మా కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : వరప్రసాద్.