భాయ్ ఫ్లాప్తో డీలా పడ్డాడు నాగార్జున. ఈసారి కథల ఎంపికపై మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నాడు కింగ్. అందుకే ఆచి తూచి కథలు ఎంచుకొంటున్నట్టు సమాచారమ్. తడాఖా దర్శకుడు డాలీతో ఎప్పుడో సినిమా మొదలవ్వాల్సింది. కానీ ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ కథ సిద్ధమైందట. నాగ్ని సరికొత్త గా ప్రజెంట్ చేస్తానని మాట ఇవ్వడంతో డాలీతో జట్టు కట్టడానికి నాగ్ ఒప్పుకొన్నాడని తెలిసింది. ఈ సినిమాలో నాగ్ సరసన ఇద్దరు కథానాయికలు ఉంటారు. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.