కథ ఒకే అయ్యిందా?

nagarjunaభాయ్ ఫ్లాప్‌తో డీలా ప‌డ్డాడు నాగార్జున‌. ఈసారి క‌థ‌ల ఎంపిక‌పై మ‌రింత జాగ్రత్తగా ఉండాల‌ని భావిస్తున్నాడు కింగ్‌. అందుకే ఆచి తూచి క‌థ‌లు ఎంచుకొంటున్నట్టు స‌మాచార‌మ్‌. త‌డాఖా ద‌ర్శ‌కుడు డాలీతో ఎప్పుడో సినిమా మొద‌ల‌వ్వాల్సింది. కానీ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఎట్టకేల‌కు ఈ క‌థ సిద్ధమైంద‌ట‌. నాగ్‌ని స‌రికొత్త గా ప్రజెంట్ చేస్తాన‌ని మాట ఇవ్వ‌డంతో డాలీతో జ‌ట్టు క‌ట్ట‌డానికి నాగ్ ఒప్పుకొన్నాడ‌ని తెలిసింది. ఈ సినిమాలో నాగ్ స‌ర‌స‌న ఇద్దరు క‌థానాయిక‌లు ఉంటారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తారు. త్వర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.