ఈరోజే ‘డీజే శరణం భజే భజే’ సాంగ్ రిలీజ్.

అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ కి సంబదించిన ట్రైలర్స్ , సాంగ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అంత ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ ఆడియోలోని ‘డీజే శరణం భజే భజే’ పాటను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సడెన్ గా సాంగ్ రిలీజ్ చేయబోతుండడం ఫాన్స్ పండగా చేసుకుంటున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నారు. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు.