ఆ విషయంలో తల్లిదండ్రులు చాల ఫీల్ అవుతున్నారట..

దిశా పటానీ..పరిచయం చేయాల్సిన పనిలేని పేరు..‘లోఫర్’ మూవీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ..హిందీలో ధోని చిత్రంతో ప్రేక్షకుల అలరించింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలతో అతి తక్కువ టైం లో ఫుల్ పాపులర్ అయ్యింది. అయితే ఈ భామ కు సినిమాల కన్నా సోషల్ మీడియా లో పెట్టె ఫొటోస్ తోనే అమందికి బాగా క్రేజ్ వచ్చింది.

ఈ ఫొటోస్ పట్ల తన తల్లిందండ్రుల ఫీలింగ్ ఎలా ఉంటుందనేది చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె సల్మాన్ నటించిన భారత్ సినిమాలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ..నా కుటుంబం నేను చేసే సినిమా లను ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది.. నేను సినిమాలలో ఎలాంటి పాత్రలు చేసినా, అది నా వృత్తిలో భాగమే అని వాళ్ళకి తెలుసు. పొట్టిబట్టల్లో హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో, వాళ్ళ ఫ్యామిలీ గ్రూపులో షేర్ చేసినప్పుడు మాత్రం చాల ఇబ్బందిగా ఫీల్ అవుతారని.. ఎంతైనా తల్లి దండ్రులు కదా..అని తెలిపింది.