‘శివోహం’ అంటూ వస్తున్న ‘రాక్షసుడు’ డైరెక్టర్..


‘రాక్ష‌సుడు’ వంటి క్రైమ్ థ్రిల్ల‌ర్‌ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స‌, విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నారు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న నెక్ట్స్ మూవీ ‘శివోహం’ తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌టానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. దానికి సంబంధించిన వివరాల‌ను ఈరోజు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై డిఫ‌రెంట్ పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతుంది.

‘మిస్టీరియ‌స్ సాగా గురించి మీకు తెలియజేస్తున్నాం. ఎవ‌రికీ అంతుచిక్క‌ని నిధి, ఓ డెవిల్‌కి మ‌ధ్య న‌డిచే యుద్ధం’ అని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌ట‌మే కాకుండా అంద‌రిలోనూ క్యూరియాసిటీని క‌లిగించే పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ‘శివోహం’ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే గుడి ద్వారం మూసి వేయ‌డింది. దాని ముందు ఓ త్రిశూలం క‌నిపిస్తోంది. అలాగే పూజా సామాగ్రి అంతా కూడా ఉంది. ఇది ఆడియెన్స్‌లో తెలియ‌ని ఓ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. క‌చ్చితంగా ఎవ‌రికీ తెలియ‌ని ర‌హస్య‌మేదో ఉంద‌నే ఆలోచ‌న క‌లుగుతుంది. కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా స‌మ‌ర్ప‌ణ‌లో సంతోష్ డెటాకె సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న’శివోహం’ చిత్రానికి సంబంధించి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.