‘ఎవడు’ వచ్చేది ఖాయం!

charan2రామ్‌చ‌ర‌ణ్ హీరో గా న‌టించిన చిత్రం ఎవ‌డు. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ను జూలై 25 విడుదల చేయడాని సన్నాహాలు చేశారు. ఇది కాస్త 31కి వాయిదా పడింది. 31కైనా వస్తోందా?అనే అనుమానం అభిమానుల్లో వుంది. ఈ డౌట్స్ పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. ఎవడు’ సినిమా ముందుగా అనుకున్నట్టు గానే జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుందని, రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.

‘ఎవడు’ రిలీజ్ అయిన ఒక వారం గ్యాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలవుతోందన్న ప్రశ్నకు బదులు చెబుతూ.. మేము ముందుగా ఎవడు వాయిదా వెయ్యాలని అనుకున్నాం కానీ సరైన తేదీ దొరకలేదు. అత్తారింటికి దారేది డేట్ అనౌన్స్ చేసేసారు, అలాగే జంజీర్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. కావున 31నే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. కానీ దీనివల్ల ఎలాంటి సమస్య లేదు.. గదర్, లగాన్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి కానీ రెండూ ట్రెండ్ సెట్ చేసాయని’ గుర్తు చేశారు.