సాధారణంగా ఫిల్మ్స్టార్ల పుట్టినరోజు వేడుకలు జరిపితే – మీడియాని పిలిచి మర్యాద పూర్వకంగా కాక్టైల్ పార్టీలు ఇస్తుంటారు. శనివారం వంశీపైడిపల్లి పుట్టిన రోజు. ఎవడు ప్రెస్మీట్ జరిపి, అందులోనే సాయికుమార్, వంశీ పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. మీడియాకి కాక్టైట్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు గంటన్నర ఆలస్యంగా వచ్చాడు. ఆయన వచ్చే వరకూ మీడియా ప్రతినిధులు ఎదురుచూపుల్లో పడిపోయారు. దిల్రాజు వచ్చాక.. అదేంటి సార్ ఆలస్యమైంది?? అని అడిగితే మీరొచ్చింది నా కోసం కాదు కదా? మందు తాగడానికి కదా..? అన్నాడట. దాంతో అక్కడున్నవాళ్లందరికీ మండింది. సరేసార్… వెళ్లొస్తాం అంటూ ప్రెస్ మీట్ అయిపోయిన తరవాత… కనీసం భోజనం కూడా చేయకుండా లేచొచ్చేశారంతా! దాంతో దిల్ రాజుకి దడదడ మొదలైంది. అయ్యే నేను సరదాగా అన్నా.. అని కవరింగ్ చేసుకొన్నా ఫలితం లేకపోయింది. మీడియా పార్టీని బహిష్కరించి బయటకు వచ్చేసింది! మీడియా అంటే దిల్రాజుకి ఎంత చులకనో.. ఈ సంఘటన బయట పెట్టింది. పాత్రికేయులు మందు, విందుకి పడిపోతారని దిల్ రాజు అనుకొంటున్నాడేమో..! దిల్ రాజుకి గట్టిగా బుద్ది చెప్పాలని టీవీ, పత్రికలవాళ్లు గట్టిగా తీర్మాణించుకొన్నట్టు తెలిసింది. ఇక… ఎవడు ప్రమోషన్కి చిల్లు పడినట్టే!