హైదరాబాద్ బ్లూస్`,`ఇక్బాల్` వంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ డైరెక్టర్ నగేశ్ కుకునూర్. ఈయన కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు కాంబినేషన్లో రూపొందుతోన్నచిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు. స్పోర్ట్స్ రొమెడీ జోనర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆగస్ట్లో చివరి షెడ్యూల్ చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాని నిర్మాత దిల్రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సమర్పిస్తున్నారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ మీద సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి త్వరలోనే ఈ చిత్ర టైటిల్ను, ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నారు.
అయితే ఈ శ్రావ్య వర్మ ఎవరో కాదు, మన వివాదాస్పద దర్శకుడు వర్మ మేనకోడలు. పెద్దగా పర్సనల్ విషయాలను షేర్ చేయడానికి ఇష్టపడని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా తన మేనకోడల్ని అప్పట్లో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా తన మేనకోడలు శ్రావ్య వర్మతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె టాలెంట్పై ప్రశంసలు కురిపించారు. క్యాస్ట్యూమ్ డిజైనర్గా శ్రావ్యవర్మది సూపర్ టాలెంట్ అని ఆమెని పరిచయం చేశారు. ఇప్పుడు ఆమె సహా నిర్మాతగా పనిచేస్తున్న సినిమాకి దిల్ రాజు సపోర్ట్ ఇస్తున్నారన్నమాట.