ఒకప్పుడు కృష్ణ వంశీ పేరు చూసి సినిమా థియేటర్స్ కు వెళ్ళే అబిమానులు ఇప్పుడు కృష్ణ వంశీ సినిమా అంటేనే వామ్మో అనే అంతగా బాడ్ నేమ్ తెచ్చుకున్నాడు.. ఈ మద్యనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే చిత్రం చేసిన అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గానే చేదు అనుభవాన్ని మిగిలిచింది. ఆ చిత్రం తర్వాత మరే ఏ చిత్రానికి కృష్ణ వంశీ ఒప్పుకోలేదు..
తాజాగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో ఓ సినిమా చేస్తున్నాడని ఫిలిం నగర్ లో వార్త ప్రచారం జరుగుతుంది.. సందీప్ కిషన్ హీరో గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం రాబోతుందట..మిగతా కాస్ట్ క్రూ మాత్రం ఇంకా బయటకు రాలేదు..ఈ వార్త తెలుసుకున్న దిల్ రాజు సన్నిహితులు మాత్రం కృష్ణ వంశీ తో సినిమా అంటే జాగ్రత్త అని చెపుతున్నారట..మరి దిల్ రాజు తో అయిన ఓ సక్సెస్ ఇస్తాడో లేదో చూడాలి…