హీరోయిన్స్ ని మారుస్తున్న ”దిల్ రాజు”..

Dil-Rajuటాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి తక్కువ టైం లో ఓ బడా నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు , ఒకప్పుడు వరుస పెట్టి పెద్ద సినిమాలు తీసేవాడు, కానీ ఎందుకో ఈ మద్య సినిమా చేయడం మానేసి కేవలం డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్నాడు. తాజాగా సుమంత్ అశ్విన్ హీరోగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో దిల్ రాజు ‘కేరింత’ టైటిల్ తో ఓ చిత్రం నిర్మిస్తున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రం లో సుమంత్ సరసన నటించడానికి ముందుగా అవికా గోర్ ను అనుకున్నారు. తర్వాత లావణ్య త్రిపాఠిని కథానాయికగా తీసుకున్నారు. అయితే ఎందుకు అవికా గోర్ తీసేసారని అనే వార్త మాత్రం బయటకు రాలేదు… తరవాత లావణ్య త్రిపాఠిని ఈ సినిమా నుంచి తప్పించి వెంకటేష్ కూతురిగా ‘దృశ్యం’ చిత్రంలో నటించిన కృతికజయకుమార్ ని కథానాయికగా తీసుకున్నారు.

తాజాగా కృతికజయకుమార్ పట్ల కూడా దిల్ రాజు చాలా అసంతృప్తిగా ఉన్నాడని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఆమెను తప్పించి, వేరే హీరోయిన్ ని తీసుకోవాలనే ఆలోచనతో దిల్ రాజు ఉన్నాడని ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న ప్రచారం. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన తర్వాత దిల్ రాజు హీరోయిన్ ని తప్పించడం ఫై ఇండస్ట్రీ లో అందరు చేర్చంచుకుంటున్నారు.