Site icon TeluguMirchi.com

ప్రభాస్ కు దగ్గర కావడం కోసం రూ. 40 కోట్లు

టాలీవుడ్ ఇండస్ట్రీ లో దిల్ రాజు అంటే ఓ ప్రత్యేకం .. అగ్ర హీరోలతో పాటు నటి నటులకు బాగా క్లోజ్ గా ఉంటాడు. అందుకే ఆయన తో సినిమాలు చేసేందుకు ప్రతి ఒక్కరు పోటీ పడతారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరి తో సినిమాలు చేసాడు. అయితే ప్రభాస్ తో దిల్ రాజు రెండు సినిమాలు చేసాడు. మున్నా , మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలు చేయగా ..మున్నా ప్లాప్ కాగా మిస్టర్ ఫర్ఫెక్ట్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కు దిల్ రాజు మధ్య ఏదో వివాదం చెలరేగిందని..అప్పటి నుండి ప్రభాస్ – దిల్ రాజు మధ్య మాటలు లేవనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొట్టడం మొదలు అయ్యాయి.

ఇక రీసెంట్ గా మళ్లీ ప్రభాస్ తో దగ్గర కావాలని దిల్ రాజు చూస్తున్నాడట. అందుకే ప్రభాస్ నటిస్తున్న సాహో నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ కు దాదాపు రూ. 40 కోట్లకు దక్కించుకున్నాడని అంటున్నారు. ఇంత భారీ మొత్తం పెట్టడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి.

Exit mobile version