మళ్లీ ముగ్గురు కలిశారు..ఇక దిలే

నితిన్ – నిర్మాత రాజు కాంబినేషన్ లో వచ్చిన దిల్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం తర్వాత రాజు కాస్త దిల్ రాజు అయ్యారు. మాస్ ఆడియన్స్ లలో నితిన్ ఫుల్ ఫ్యాన్స్ అయ్యారు. ఇక వీరిద్దరికి కాదు ఈ మూవీ లో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ కు సైతం మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముగ్గురు వారి వారి సినిమాలతో టాప్ పొజిషన్ లో ఉన్నారు.

ఇక ఇంతకాలానికి మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. నితిన్‌ , రాశిఖన్నా జంటగా దిల్‌రాజు బ్యానర్‌లో శ్రీనివాస కళ్యాణం మూవీలో తెరకెక్కుతోంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ‍ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్బంగా నితిన్‌ ‘మళ్లీ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి దిల్‌ కాంబో వస్తోందం’టూ.. తన ట్విట్టర్ ద్వారా ట్వీట్‌ చేసాడు.