దీపావళికి పేలనున్న ధృవ…

Druva-audio-rightsమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ..తమిళ చిత్రం తనిఒరువన్ కు రీమేక్ గా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60% పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో ఉంటుందని మొదటినుండి ప్రచారం జరిగిన , ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ఈ చిత్రం దీపావళి రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది..

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్లే ముందుగా చెప్పిన డేట్ కు రిలీజ్ చేయకపోతున్నారట. ప్రస్తుతం టాకీ పార్ట్ తో పాటు మూడు పాటలు బ్యాలెన్స్, అరవింద స్వామిపై తీయాల్సిన ముఖ్యమైన సన్నివేశాలు ఇంకా మిగిలి ఉన్నాయట..అవన్నీ పూర్తి కావడానికి మరో నెల రోజుల వరకు టైం పట్టడం తో చిత్రాన్ని దీపావళి రిలీజ్ చేయాలనీ నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నాడట.