పూరి – కళ్యాణ్ రామ్ ల ‘ఇజం’, రామ్ – సంతోష్ శ్రీనివాస్ ల ‘హైపర్ ‘ ప్రకాష్ రాజ్ – ప్రియమణి ల ‘మనవూరి రామాయణం’ ఈ మూడు చిత్రాలు కూడా అక్టోబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు . అంటే వీరిద్దరికి ధృవ రావడం లేదని తెలుసు..అందుకే తమ చిత్రాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారని ఫిలిం సర్కిల్ లో చెప్పుకుంటున్నారు. అంతే కాదు రామ్ చరణ్ కు అక్టోబర్ నెల అంతగా కలిసిరాదు కాబట్టే ధృవ చిత్రం పోస్ట్ పోనే చేశారనే వార్త కూడా ప్రచారం అవుతుంది..చరణ్ గత చిత్రాలు గోవిందుడు అందరివాడేలే.. బ్రూస్ లీ ఈ రెండు కూడా అక్టోబర్ నెలలో వచ్చి తీవ్రగా డిస్ట్రిబ్యూటర్లను నష్ట పరిచాయి. అందుకే వారందరు ద్రవ చిత్రాన్ని పోస్ట్ పోనే చేయమని అరవింద్ ఫై ఒత్తిడి తెచ్చారని అందుకే ధృవ దసరా బరి నుండి తప్పించారని అంటున్నారు..మరి అది ఎంత వరకు నిజమో అనేది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.