దసరా బరి నుండి చరణ్ తప్పుకున్నాడా..?

Druva-audio-rightsమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధృవ’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం అభిమానులను అలరించడానికి దసరా కు వస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం దసరా బరి నుండి రామ్ చరణ్ తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా అనుకుంటున్నారా..! రామ్ చరణ్ సినిమా వస్తుందంటే ఏ చిత్రయినా పోస్ట్ పోనే చేసుకుంటారు..అలాంటిది ధృవ వస్తుందని తెలిసి కూడా చిన్న చిత్రాలనుండి పెద్ద చిత్రాల వరకు అదే రోజున రిలీజ్ చేస్తుండడం అందరికి అనుమానాలకు దారితీసింది.

పూరి – కళ్యాణ్ రామ్ ల ‘ఇజం’, రామ్ – సంతోష్ శ్రీనివాస్ ల ‘హైపర్ ‘ ప్రకాష్ రాజ్ – ప్రియమణి ల ‘మనవూరి రామాయణం’ ఈ మూడు చిత్రాలు కూడా అక్టోబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు . అంటే వీరిద్దరికి ధృవ రావడం లేదని తెలుసు..అందుకే తమ చిత్రాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారని ఫిలిం సర్కిల్ లో చెప్పుకుంటున్నారు. అంతే కాదు రామ్ చరణ్ కు అక్టోబర్ నెల అంతగా కలిసిరాదు కాబట్టే ధృవ చిత్రం పోస్ట్ పోనే చేశారనే వార్త కూడా ప్రచారం అవుతుంది..చరణ్ గత చిత్రాలు గోవిందుడు అందరివాడేలే.. బ్రూస్ లీ ఈ రెండు కూడా అక్టోబర్ నెలలో వచ్చి తీవ్రగా డిస్ట్రిబ్యూటర్లను నష్ట పరిచాయి. అందుకే వారందరు ద్రవ చిత్రాన్ని పోస్ట్ పోనే చేయమని అరవింద్ ఫై ఒత్తిడి తెచ్చారని అందుకే ధృవ దసరా బరి నుండి తప్పించారని అంటున్నారు..మరి అది ఎంత వరకు నిజమో అనేది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు.