ఇక ఈ ఆడియో వేడుక నవంబర్ 9న గ్రాండ్ గా జరగబోతుందని , పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషం లో ఆడియోనే రద్దు చేసి డైరెక్ట్ గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తుండడం తో అభిమానులు నిరాశ చెందారు. ఇక వారిని ఉత్సహపరచడానికి చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించబోతున్నారు..అది కూడా తెలంగాణ రాష్టం లోని వరంగల్ జిల్లాలో నిర్వహించాలని నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు. అందరు మెగా హీరోల సమక్షంలో భారీ స్థాయిలో ఈ ఫంక్షన్ ఉండబోతుందని సమాచారం. ఏ డేట్ కు చేస్తారనేది మరో రెండు మూడు రోజుల్లో తెలియనుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో చరణ్ కు జోడిగా రకుల్ ప్రీతి సింగ్ నటించింది.