ఈ నేపథ్యం లో చిత్ర ఆడియో రైట్స్ ఫై విపరీతమైన క్రేజ్ రావడం తో పలు కంపెనీ పోటీల మధ్య ఆదిత్య మ్యూజిక్ చిత్ర ఆడియో హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దసరా కానుకగా రాబోతున్న ధ్రువ చిత్ర ఆడియో సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
రామ్ చరణ్ కు జంటగా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుంది, గతం లో వీరిద్దరి కాంబినేషన్ లో బ్రూస్ లీ చిత్రం వచ్చింది. అలాగే అవవింద్ స్వామి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.