Dhoom Dham : ఆకట్టుకుంటున్న ‘ధూం ధాం’ నుంచి ‘మాయా సుందరి..’ సాంగ్


చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మల్లెపూల టాక్సీ..’ పాట ఛాట్ బస్టర్ అయ్యింది. మంగ్లీ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘మాయా సుందరి..’ విడుదల చేశారు మేకర్స్.

SDGM : బాలీవుడ్ హీరోతో టాలీవుడ్ డైరెక్టర్ మూవీ !

‘మాయా సుందరి..హే మాయా సుందరి.. నా మాయా సుందరి.. ఎక్కడున్నావో మరి.. గుప్పెడు గుండెను నువ్వే పట్టుకుపోయావే, నా రెప్పల నిద్దురనంతా ఎత్తుకుపోయావే..’ అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. గోపీ సుందర్ మంచి బీట్ తో కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి పాడారు. ఇకపోతే ఈ సినిమాలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Kalki 2898 AD : గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేయడం.. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం : ప్రభాస్