వై దిస్ కొలవెరి అంటూ ధనుష్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ పాటతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ‘రాన్జానా’తో బాలీవుడ్ లో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు ధనుష్. ఈ చిత్రంలోని ధనుష్ నటనక బాలీవుడ్ సలాం కొట్టింది. రాన్జానా తరవాత ధనుష్కు బాలీవుడ్లో ఆఫర్లు అందుతూనే ఉన్నాయి.కానీ వేటినీ ఒప్పుకోలేదు. ఇప్పుడో చిత్రంపై సంతకం చేశాడు. బాల్కీ దర్శకత్వంలో నటించడానికి ధనదుష్ ఒప్పుకొన్నాడు. అన్నట్టు ఈసినిమాలో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ధనుష్ ధృవీకరించారు. ” ఫ్రెండ్స్.. గుడ్ న్యూస్. బాల్కీ దర్శకత్వంలో నటిస్తున్నా. ఇదే చిత్రంలో బిగ్బీతో కలసి నటించే అవకాశం దక్కింది” అని ట్విట్ చేశాడు ధనుష్. మరి రెండో సినిమాతో ఈ రజనీకాంత్ అల్లుడు బాలీవుడ్లో ఎలాంటి స్థానం దక్కించుకొంటాడో చూడాలి.