Site icon TeluguMirchi.com

హమ్మయ్య..కోర్ట్ కేసు నుండి ధనుష్ బయటపడ్డాడు..

court

కొన్ని నెలలుగా తాను ఎవరి కొడుకో లోకానికి చెప్పలేక నానా ఇబ్బందులు పడుతున్న హీరో ధనుష్..కోర్ట్ తీర్పు తో కాస్త నిమ్మల పడ్డాడు. ధనుష్ తమ కొడుకేనని.. వృద్ధాప్యంలో తమను పట్టించుకోవడం లేదని కదిరేశన్ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెల్సిందే..

కొన్ని రోజులు గా ఈ కేసు కోర్టు లో నడుస్తుంది ఉంది.. కదిరేశన్ దంపతులు చెప్పిన పుట్టుమచ్చలు ధనుష్ ఒంటిపై ఉన్నా.. వాటిని బలవంతంగా లేజర్ ట్రీట్మెంట్ తో తొలగించుకున్నాడని డాక్టర్లు స్పష్టం చేయడం తో ధనుష్ కదిరేశన్ కొడుకే అని అంత అనుకున్నారు. కోర్ట్ కూడా అలాగే తీర్పు ఇస్తుందని అంత అనుకున్న టైం లో కోర్టు తీర్పు మాత్రం ఆశ్చర్యకరంగా వచ్చింది. ధనుష్ వారి కొడుకే అని నిర్ధారించేందుకు.. కదిరేశన్ దంపతులు చూపిన సాక్ష్యాలు సరిపోవని కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు తో ధనుష్ కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు.

Exit mobile version