”నా సినిమాని ధనలక్ష్మి కావాలని అడ్డుకొంది. జరిగిన నష్టానికి ఆమే బాధ్యురాలు..” అంటూ సెన్సార్ బోర్డ్ అధికారిని ధనలక్ష్మిపై నాంపల్లి కోర్డులో కేసు ఫైల్ చేశాడు రాంగోపాల్ వర్మ. అయితే ఇందుకు ధనలక్ష్మి కూడా స్పందించింది. ”ఇదేం వర్మపై వ్యక్తిగత ద్వేషంతో చేసింది కాదు. సినిమాలోకొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయి. మూడు పాత్రల పేర్లకు అభ్యంతరం చెప్పాం. అవి సమాజంలోని కొంతమంది ప్రముఖుల పేర్లను ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఇది నేను ఒక్కదాన్నే తీసుకొన్న నిర్ణయం కాదు. సెన్సార్ బోర్డు సభ్యులంతా తీసుకొన్న ఉమ్మడి నిర్ణయం. ఈ విషయంలో వర్మ నాంపల్లి కోర్టును ఆశ్రయించడం కంటే రివైజింగ్ కమిటీ కి ఆశ్రయిస్తే బాగుండేది కదా..” అన్నారావిడ. మరి వర్మ ఎలాంటి సమాధానం చెబుతాడో మరి??