ఇది వరకు పవన్ కల్యాణ్ సినిమా అనగానే రమణ గోగుల గుర్తొచ్చేవాడు. తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం.. ఇలా వీరిద్దరి జంట చాలా సినిమాల్లో కొనసాగింది. రమణ గోగులకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది పనవ్ సినిమాల వల్లే. ఆ తరవాత మణిశర్మ పేరు వినిపించింది. పవన్ కల్యాన్ బ్లాక్ బ్లస్టర్ హిట్ ఖుషీకి ఆయనే సంగీతం అందించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే డీఎస్పీని తలచుకోవలసిందే. వపన్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలొచ్చాయి. అన్నీ సూపర్ హిట్లే. ఖుషీ తరవాత అంతటి హిట్ జల్సా ఇచ్చింది. గబ్బర్ సింగ్ అయితే రికార్డుల దుమ్ము దులిపాడు. అత్తారింటికి తొలి టాలీవుడ్ వంద కోట్ల సినిమాగా గుర్తింపు తెచ్చుకొంటోంది. అలా.. డీఎస్పీ హ్యాండ్ వపన్కి బాగా కలిసొచ్చింది. అందుకే గబ్బర్ సింగ్ 2కీ దేవిశ్రీనే సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నాడు పవన్. గబ్బర్ సింగ్ కి పనిచేసిన సాంకేతిక నిపుణుల్లో చాలామందికి గబ్బర్ సింగ్ 2లో చోటు లేదు. కానీ దేవి స్థానం మాత్రం మరొకరితో భర్తీ చేయడం పవన్ కి ఇష్టం లేదట. అందుకే తొలి సాంకేతిక నిపుణుడిగా దేవిశ్రీ పేరు పవన్ సూచించినట్టు తెలిసింది. పవన్ కల్యాణ్ సినిమా అంటే… మరింత శ్రద్ధతో సంగీతం అందించే డీఎస్పీ నాలుగో సారీ రెచ్చిపోతాడేమో చూడాలి.