క్రిష్ మాత్రం ఈ సినిమాకు కంచె చిత్రానికి మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ ను ముందుగా అనుకున్నాడట. కానీ ఇలాంటి చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రానికి అతనికంటే , మ్యూజిక్ మేస్త్రో ఇళయరాజా అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. బాలయ్య సైతం రాజాకే మొగ్గు చూపించడం తో ఇళయరాజా ను కన్ఫామ్ చేసే ఆలోచనలో క్రిష్ ఉన్నాడట. మరో రెండు రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఫై అధికారిక ప్రకటన తెలియనుంది.
ఈ చిత్రాన్ని వై.రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. యావత్ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జీవితంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.