దర్శకుడు రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, పీవోడబ్ల్యూ తదితర మహిళా సంఘాల ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళననుద్దేశించి తెలంగాణ సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ.. స్త్రీలంటే దేవతలుగా కొలిచే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను మంటలో కలిపే విధంగా చిత్రాన్ని తెరకెక్కికించి, యువత ఆకర్షితులయ్యేలా ప్రచారం చేసుకుంటున్న వర్మను విచారణ చేసి, పోలీసులు విడిచిపెట్టారని, తక్షణమే ఆయన్ను అరెస్టు చేయాలన్నారు.
ఇదీలావుంటే రామ్గోపాల్వర్మపై విశాఖలో మరో కేసు నమోదైంది. హోంమంత్రి చినరాజప్ప ఆదేశాల నేపథ్యంలో.. నగర పోలీసు కమిషనర్ యోగానంద్ సూచనల మేరకు ఎంవీపీ పోలీసుస్టేషన్లో వర్మపై కేసు నమోదు చేశారు.