ప్రపంచ తెలుగు మహాసభల్లో “దేవస్థానం”

devastanam_telugu_movie_wallpapers_006ఎస్పీ బాలు, కె. విశ్వనాథ్, ఆమని ప్రధాన పాత్రల్లో జనార్థన్ మహర్షి తెరకెక్కించిన దేవస్థానం చిత్రాన్ని త్వరలో దేశ, విదేశీయులు తిలకించబోతున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మేళవించి తెరకెక్కించిన ఈ అచ్చతెలుగు చిత్రం ఈ నెల ౨౮న ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శించబడుతోంది. అలాగే వెన్నెముద్దలు, గుడి, పంచామృతం, కవిగానే కన్నుమూస్తా, నాకు నేను రాసుకున్న ప్రేమ లేఖ వంటి జనార్థన్ మహర్షి రచించిన పుస్తకాలను కూడా ప్రదర్శనకు ఉంచబోతున్నారు. ఈ విషయాలు తెలియజేస్తూ.. మహర్షి ఇది తానెంతో అదృష్టంగా భావిస్తున్నాని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా తన చిత్రాన్ని ఆశిర్వదించాలని చెప్పారు. ప్రస్తుతం శ్రియ కథానాయికగా ఓ విభిన్నమైన కథాంశంతో పవిత్ర అనే చిత్రాన్ని జనార్థన్ మహర్షి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.