దీపికా పదుకునే ఫై యాసిడ్ దాడి..

టైటిల్ చూసి నిజమా అని ఖంగారు పడుతున్నారా..అదేమీ లేదండి ఇదంతా సినిమాలోని భాగమే. దీపికా ‘పద్మావత్’ తర్వాత చాల గ్యాప్ తీసుకొని ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యింది. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ లో దీపికా నటించేందుకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జర్ డైరెక్ట్ చేస్తుండగా , లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా నటించడమే కాదు నిర్మిస్తుంది. ఈ విషయాన్నీ స్వయం గా దీపికానే తెలిపింది.


” ఈ కథ నన్ను చాలా కదిలించింది. నా మీద ఈ కథ చాలా ప్రభావాన్ని చూపించింది. అందుకే ఈ చిత్రాన్ని నిర్మించాలని కూడా నిర్ణయం తీసుకున్నా అంటూ తెలిపింది. కాగా ఢిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ 15 సంవత్సరాల వయసులో యాసిడ్ దాడికి గురైంది. ఆ తరువాత కోలుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె పలువరు యాసిడ్ దాడి బాధితులకు అండగా ఉండటంతో పాటు.. యాసిడ్ దాడికి వ్యతిరేకంగా పలు క్యాంపైన్లు నిర్వహిస్తుంది.