Site icon TeluguMirchi.com

అత్తారింటికి దారేది చూసిన దాసరి

dasariప‌వ‌న్ త‌న త‌డాఖా చూపిస్తున్నాడు. చిత్రసీమ‌లో అంద‌రినీ త‌న వైపుకు తిప్పుకొంటున్నాడు. ఆదివారం హైద‌రాబాద్‌ లోని శిల్పక‌ళావేదిక‌లో ‘అత్తారింటికి దారేది’ విజ‌యోత్సవ స‌భ నిర్వహించాల‌ని చిత్రబృందం భావించింది. ఈ వేడుకలో సినీ ప్రముఖులంతా పాలుపంచుకొంటారు. దాస‌రి నారాయ‌ణరావుకీ ఆహ్వానం అందింది. ఆయ‌నా ఈ సభ‌కు రావాల‌ని ఉత్సాహం చూపిస్తున్నారు. ఏదైనా విజ‌యోత్సవ స‌భ‌కు హాజ‌ర‌య్యే ముందు ఆ సినిమా చూడ‌డం దాస‌రి అల‌వాటు. అందుకే మంగ‌ళ‌వారం అత్తారింటికి దారేది సినిమాని ఆయ‌న ప్రత్యేకంగా చూశారు. సినిమా ఆసాంతం చూసిన త‌ర‌వాత త్రివిక్రమ్‌ కి అభినంద‌న‌లూ తెలిపారు. ఇక ప‌వ‌న్ ని ఆకాశానికి ఎత్తడ‌మే త‌రువాయి. ప‌వ‌న్ గురించి దాసరి ఏం మాట్లాడ‌తారో వినాల‌ని యావ‌త్ చిత్రసీమ ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఉత్కంఠ‌త‌కు ఆదివారం రాత్రి తెర ప‌డుతుంది. అందాక‌.. వెయిట్ అండ్ వాచ్‌..!

Exit mobile version