గతేడాది దర్శకరత్న దాసరి నారాయణరావు నుంచి సినిమాలేం రాలేదు. నాలుగైదు సినిమాల్ని ప్రకటించారు గానీ… అందులో ఒక్కటీ సెట్స్పైకి తీసుకెళ్లలేదు. ఈసారి మాత్రం దర్శకుడిగా బిజీ అవ్వాలనుకొంటున్నారు. ఆదివారం దాసరి జన్మదినం. ఈ సందర్భంగా ఓ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అదే…. పితృదేవోభవ. తన బిడ్డల కోసం తండ్రి పడే ఆరాటం ఈ చిత్రం. స్ర్కిప్టు పూర్తయింది. ఈనెలలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ప్రధాన పాత్రధారి ఎవరన్నది త్వరలో ప్రకటించబోతున్నారు. ”వడ్డీకాసుల వాడు అనే సినిమా తీయాలనుకొన్నా. స్ర్కిప్టు కూడా రెడీ అయిపోయింది. అయితే… రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. రాష్ట్రం రెండుగా చీలకముందు.. రాసుకొన్న సబ్జెక్ట్. అప్పటికి అదే కరెక్ట్. ఇప్పుడు ఆ కథ రిసీవ్ చేసుకోరు. అందుకే వడ్డీకాసుల వాడు సినిమాని పక్కన పెట్టా. త్వరలోనే రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా తీస్తా. దానికి సంబంధించిన పనులూ జరుగుతున్నాయి” అన్నారు దాసరి.