స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న హైదరాబాద్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా దర్శక రత్న దాసరి నారాయణరావు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యకారణం అల్లు రామలింగయ్యగారి కుటుంబంతో నాకు వున్న అనుబంధం. గీతా ఆర్ట్స్ అనే సంస్థ నా చేతుల మీదుగా ప్రారంభించాను. ఈ బేనర్లో రెండు హిట్ సినిమాలు చేశాను. ఒకప్పుడు ఎన్టీఆర్కి, ఎఎన్నార్కి ఒక సెపరేట్ స్టైల్ అనేది వుండేది. ఆ తర్వాత పవన్కళ్యాణ్ ఓ ప్రత్యేకమైన స్టైల్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దాన్ని ఆ తర్వాత వచ్చిన చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చెయ్యడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం తనకంటూ ఓ స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కొంతమంది హీరోలు అర్జున్ స్టైల్ని ఫాలో అవుతున్నారు.
త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’తో పెద్ద హిట్స్ తో సూపర్ జోరు మీద ఉన్న ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని’ దాసరి అన్నాడు. ఇంత మాట్లాడిన దాసరి చిరంజీవి పేరు ను చెప్పక పోవడం తో మెగా అబిమానులు మాత్రం కాస్త దాసరి ఫై కోపం గా ఉన్నారు.