దాసరి నారాయణరావు అంటేనే ఓ సంచలనం. నిజాన్ని నిర్భయంగా సూటిగా చెప్పేస్తారు. ఈసారి ఆయన ఎవరిని టార్గెట్ చేశారో తెలీదుగానీ హీరోలకు మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దర్శకులు చెప్పింది వినండి.. అప్పుడే గొప్ప నటులు అవుతారని హితబోధ చేశారు. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన దూసుకెళ్తా ఆడియో కార్యక్రమానికి ఆయన అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ ”హీరో ఒక్క పాత్ర మాత్రమే పోషిస్తాడు. కానీ దర్శకుడు అలా కాదు. సినిమాలో నలభై పాత్రలుంటే అవన్నీ నటించి మరీ చూపిస్తాడు. ఓ నటుడిని స్టార్గా మార్చేది దర్శకుడే. మంచి దర్శకులను ఎంచుకోవాలి. అప్పుడే విజయాలు సాధించగలుగుతారు. దర్శకుడు చెప్పిన కథని అర్థం చేసుకొని సెట్ కొచ్చి, నటించిన వాళ్లే గొప్పవాళ్లు అవుతారు..” అన్నారాయన. మరి దాసరి టార్గెట్ ఎవరో మీకైనా తెలిసిందా??