దానయ్య ను ఎవరు పట్టించుకోవడం లేదట..

డీవీవీ దానయ్య…ఈ పేరు తెలియాని సినీ ప్రేక్షకులు లేరు. ఇండస్ట్రీ లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఇంతవరకు పెద్ద హిట్ కొట్టిన దాఖలాలు లేవు. తాజాగా భరత్ అనే నేను తో ఆ లోటును తీర్చుకున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని దానయ్య నిర్మించారు. కొరటాల శివ – మహేష్ బాబు కాంబినేషన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

అంత బాగానే ఉంది కానీ ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కొరటాల , మహేష్ బాబు ల గురించి చెపుతున్నారు తప్ప తన గురించి ఎవరు చెప్పడం లేదని ఫీల్ అవుతున్నాడట దానయ్య. ఇదే సినిమాను యువి క్రియేషన్స్ వాళ్లో.. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లో.. దిల్ రాజో.. అల్లు అరవిందో నిర్మించి ఉంటే వాళ్ల గురించి ఎంత బాగా చెప్పేవారో అని బాధపడుతున్నాడట. సరే దానయ్య ఆవేదన పక్కన పెడితే సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ డిస్ట్రబ్యూటర్స్ కు లాభాలను తెచ్చిపెడుతుంది.