‘ భరత్ ‘ కలెక్షన్స్ ఫై నిర్మాత క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. రెండేళ్ల తర్వాత మహేష్ సూపర్ హిట్ కొట్టడం తో అభిమానులు , ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మ రధం పడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు.. వారం రోజుల్లోనే రూ.161 కోట్ల గ్రాస్ సాధించిందంటూ చిత్ర యూనిట్ ప్రకటించడం తో అందరిలో ఈ కలెక్షన్స్ ఫై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవి ఫేక్ కలెక్షన్లంటూ ప్రచారం జోరందుకుంది. దీంతో నిర్మాత డీవీవీ దానయ్య కలెక్షన్ల ఫై క్లారిటీ ఇచ్చాడు.

శనివారం జరిగిన భరత్ అనే నేను సక్సెస్ మీట్ లో దానయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మొదటి వారానికి 161.28 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. ఇవి ఒరిజినల్ కలెక్షన్లు’’ అని దానయ్య స్పష్టం చేశాడు. ‘భరత్ అనే నేను’ నిర్మాతగా తనకెంతో గౌరవం తెచ్చిపెట్టిందని, ‘‘మా సంస్థకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం ఇచ్చిన కొరటాల శివ గారికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను అని తెలియజేసాడు.