దర్శకరత్న దాసరి తన జోరును మళ్లీ పెంచారు. మారో సారి వరుస సినిమాలతో బిజీ కానున్నారు. ఈ వరుసలోనే మంచు విష్ణు తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. విష్ణు కోసం దాసరి ఇప్పటికే కథ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆ చిత్రానికి మోహన్బాబు-వడ్డే రమేష్లు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ చిత్రం ద్వారా దాసరి యువతకు ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాసరి ‘వడ్డీ కాసులవాడు’ పై ద్రుష్టి పెట్టారు. ఇది పూర్తి అయినతరువాత విష్ణు సినిమా మొదలౌతుంది. ఈ చిత్రానికి సంభందిచి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.