సినీ పరిశ్రమలో జరిగే సంఘటనలపై తనదైన శైలి లో స్పందించే దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు తాజాగా ఆడియో ఫంక్షన్లపై ఘాటు విమర్శలు చేశారు. దాసరి మాట్లాడుతూ .. ఇటీవలి కాలంలో ఆడియో ఫంక్షన్లు రికార్డింగ్ డాన్సుల్లా మారాయని ఇది మంచి పరిణామం కాదని, అటువంటి కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటానని అన్నారు. అయితే ఎవరిని వ్యక్తి గతంగా ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు. మరో వైపు ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగోతంది. ఇటీవల ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఆడియో వేడుక లో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందడం,ఇదే సమయంలో దాసరి ఆడియో వేడుకలపై స్పందిచడం మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బలానిస్తుంది.