ఈరోజే ‘కరెంట్ తీగ’ ఆడియో విడుదల

Current-Theega-Audio
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమాతాజా చిత్రం ‘కరెంట్ తీగ’. ఈ రోజు ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం లో మంచు మనోజ్ పడిన దేవసాసు సాంగ్ ప్రోమో కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంటే, శిల్పి శర్మ ఓ ఐటెం సాంగ్ లో కనిపిచనుంది. మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల (అక్టోబర్ 2న) రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.