Site icon TeluguMirchi.com

వనదేవత ఆలయంలో చరణ్ యాక్షన్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా ఈ రోజు ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని వనదేవత ఆలయంలో సినిమాను ప్రారంభించారు. ఇందులో చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ నటించనున్నారు. బాలీవుడ్‌లో ‘ఎం.ఎస్‌ ధోనీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కైరా అడ్వాణీ.. తెలుగులో ఆమె ‘భరత్‌ అనే నేను’ లో మహేశ్‌ బాబుకు జోడీగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో అవకాశం ఆదుకుంది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోపక్క చరణ్‌ నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా చిత్రీకరణ ఆఖరి షెడ్యూల్‌ త్వరలో పూర్తికానుంది. ఇదే కాకుండా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version