సైరా రష్ చూసి షాక్ లో పడ్డ చిరు..

తెలుగు సినిమా సత్తా చాటిన చిత్రం బాహుబలి..బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ , రానా , అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల కోట్ల షేర్ సాధించి ఇదిరా సినిమా అంటే అని నిరూపించుకుంది. ఇక ఇప్పుడు సైరా తో బాహుబలి ని మరచిపోతారట.

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రం..ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. కొణెదల ప్రొడక్షన్ ఫై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను దాదాపు రూ. 250 కోట్లతో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్ర రష్ చూసిన మెగా స్టార్ సినిమా అద్భుతంగా వచ్చింది. బాహుబలి రేంజ్ సినిమా అవ్వడం ఖాయం ..మనం ప్రమోషన్ లను ఇంకాస్త బాగా చేయాలనీ చిత్ర యూనిట్ కు చెప్పాడట. చిరు మాటలతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషి అవుతున్నారట. నయనతార , బిగ్ బి అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , సుదీప్ , జగపతి బాబు వంటి భారీ తారాగణం తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దసరా కానుకగా అక్టోబర్ 02 న ఈ సినిమా తెలుగు , తమిళ్ హిందీ భాషల్లో విడుదల కానుంది.