విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పులి’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ కి జంటగా శృతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించగా, ఆలిండియా ఎవర్ గ్రీన్ స్టార్ శ్రీదేవి, కన్నడ స్టార్ సుదీప్ ప్రత్యేక పాత్రలు కనిపించనున్నారు.
ఈ చిత్రం ఆడియోను ఆగస్ట్ 2న చెన్నయ్లో విడుదల చేయబోతున్నారు. తమిళ్లో ఇళయదళపతి గా పిలువబడే విజయ్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే..దానికి తగ్గట్టుగానే ఆడియో ఫంక్షన్ని కూడా చాలా గ్రాండ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసారు. ఈ సందర్భంగా ‘పులి’ ఆడియో ఫంక్షన్కి హాజరు కావాల్సిందిగా టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవిని, సూపర్స్టార్ మహేష్ బాబు లను ముఖ్య అతిధులుగా రావాల్సిందిగా హీరో విజయ్ ఆహ్వానించారట. దీంతో ఆ ఇద్దరు కూడా ఆడియో ఫంక్షన్ కి వస్తామని మాట ఇచ్చారట.
మెగాస్టార్ చిరంజీవి రావొచ్చు అని కోలీవుడ్ వర్గాలు చెపుతున్న, మహేష్ బాబు మాత్రం ఆడియో ఫంక్షన్ కి దూరంగా ఉంటాడు కాబట్టి మరి ఈ ఆడియో కి వస్తాడో రాడో అనేది కాస్త సందేహం లో ఉంది..