దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ బ్రేక్ పడింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా విడుదల చేసి ఆకట్టుకున్నారు.
ఈ సినిమాకు రౌద్రం-రణం-రుధిరం అనే టైటిల్ను ఖరారును చేయడంతో పాటు మోషన్పోస్టర్ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్లో ఎన్టీఆర్ ను జలానికి, రామ్చరణ్ ను అగ్నికి ప్రతీకలా చూపించారు. ఇక ఈ లుక్ ఫై మెగాస్టార్ స్పందించారు.
ఉగాది సందర్భంగా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడే ఆర్ఆర్ఆర్ చిత్ర మోషన్ పోస్టర్ చూశాను. కనుల విందుగాను, రోమాలు నిక్కపొడుచుకునేలా టీజర్ ఉంది. రాజమౌళి, ఎన్టీఆర్, రాజమౌళి వర్క్ చాలా బాగుంది. కీరవాణి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ ఉగాదికి మీకు మరింత వినోదాన్ని ఆర్ఆర్ఆర్ టీజర్ అందిస్తుందని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
Just saw the motion poster of @RRRMovie
Total eye feast & goosebumps.Electrifying score by @mmkeervaani Splendid job by 1 & only @ssrajamouli @Tarak9999 & #RamCharan are absolutely fantastic! Gives immense energy on this #Ugadi day!@ajaydevgn @aliaa08 https://t.co/UVNFjiXmh5— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020